నేడు ఢిల్లీలో బీజేపీ కీలక నేతల సమావేశం… బండి సంజయ్ పోస్ట్ పై కీలక ప్రకటన !

-

నేడు ఢిల్లీలో బిజెపి కీలక సమావేశం జరుగనుంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, అన్ని రాష్ట్రాల ఇంచార్జ్లు, మోర్చాల అధ్యక్షులు,మోర్చాల ఇంచార్జ్ల తో సమావేశం కానున్నారు జేపీ నడ్డా, అమిత్‌ షా, బీఎల్‌ సంతోష్‌. పార్టీ బలోపేతం, సంస్థాగత అంశాలు, 2024 సార్వత్రిక ఎన్నికలు, ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలపై చర్చ జరగనుందట.

బిజెపి కేంద్ర కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు రెండు ధఫాలుగా సమాశం జరగనుంది. మొదటగా జాతీయ ప్రధాన కార్యదర్శులతో తర్వాత మోర్చాల అధ్యక్షులతో పార్టీ పరిస్థితులపై చర్చించనున్న అధిష్టానం.. మోడీ ప్రభుత్వ తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా బిజెపి చేపట్టిన మహాజన్‌ సంపర్క్‌ అభియాన్‌ లో భాగంగా ఆయా రాష్ట్రాల్లో చేపట్టిన కార్యక్రమాల వివరాలను ఒక నివేదిక రూపంలో అధిష్ఠానానికి సమర్పించనున్నారు నేతలు. అలాగే, ఎన్నికలు జరగనున్న తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, మిజోరం లో పరిస్థితులపై ప్రత్యేకంగా చర్చించే అవకాశం అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news