శరద్ పవార్ రాజకీయాల నుండి తప్పుకోవాలి: అజిత్ పవార్

-

గత కొన్ని రోజులుగా NCP పార్టీలో విభేదాలు మెల్ల మెల్లగా బయటకు వస్తున్న సంగతి తెలిసిందే. పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న వారిని మరియు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారి పట్ల NCP చీఫ్ శరద్ పవార్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా NCP తిరుగుబాటు నేత అజిత్ పవార్ శరద్ పవార్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అజిత్ పవార్ మాట్లాడుతూ… శరద్ పవార్ రాజకీయాలలో ఇక చేసింది చాలు … రాజకీయాల నుండి తప్పుకోవడానికి అతనికి ఇదే మంచి సమయం అని చెబుతున్నారు. ఇంకా పార్టీలో ముందు తరాల వారికి అవకాశాలు ఇవ్వాలని అజిత్ పవార్ సూచించారు. ప్రభుత్వ అధికారులకు మరియు ఉద్యోగస్తులకు సైతం ఒక నిర్దిష్ట సమయం ఉంటుందని… ఇక శరద్ పవార్ కూడా అర్థం చేసుకుని NCP అధ్యక్ష పదవి నుండి మరియు రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకోవాలని చెప్పాడు. ఇక మా మీద వస్తున్న అభియోగాలు తప్పు అని తేలితే సర్దుబాటు చేసుకుని ముందుకు వెళతామని చెప్పారు.

మాకు 40 మంది ఎమ్మెల్యే ల మద్దతు ఉందని కూడా అజిత్ పవార్ చెప్పడం విశేషం.. మరి శరద్ పవార్ ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news