ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్

-

ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఏకంగా నలుగురు ప్రయాణికులు స్పాట్ డెడ్ అయ్యారు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే..ఆదిలాబాద్‌ జిల్లా గుడి హాత్నూర్ మండలం మేకల గండి వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

ఆటోను ఢీ కొట్టింది గుర్తు తెలియని వాహనం. దీంతో నలుగురు ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ప్రమాద సమయం లో ఆటోలో 9 మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం. ఇచ్చోడకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఏ వాహనం ఢీ కొట్టిందనే విషయంపై సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నారు పోలీసులు. మృతులు శైలజ, పొచ్చన్న, సలోమీ, గంగు ఉన్నారు. గాయపడ్డ వారు…మడవి ప్రేమ్ సాగర్, మడవి దీపక్, తేజ వర్ధన్, ఆరాధ్య, చిన్ని ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news