భారతదేశంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి వచ్చే ఎన్నికల్లోనూ గెలిచి అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న కసితో గ్రౌండ్ వర్క్ ను స్టార్ట్ చేసింది. అందులో భాగంగా జులై 18వ తేదీన ఢిల్లీలో ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీల అధినేతలతో మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ మీటింగ్ లో దేశవ్యాప్తంగా కూటమిలో ఉన్న పార్టీల మీద అభిప్రాయం ఏ విధంగా ఉంది. ఏ రాష్ట్రంలో అయినా పరిస్థితి కష్టంగా ఉందా ? అందుకు మనము ఏమిచేస్తే పార్టీకి విజయావకాశాలు ఉంటాయి అంటూ చర్చించడానికి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అందుకోసం ఆంధ్రప్రదేశ్ కు చెందిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు కూడా ఆహ్వానం అందింది. ఎందుకంటే అధికారికంగా జనసేన ఎన్డీఏ కూటమిలో ఒక పార్టీ గా ఉంది. కాగా ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ వెళ్లి తన అభిప్రాయాలను పార్టీ పెద్దలకు తెలియచేస్తారని పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.
కాబట్టి జులై 18వ తేదీన పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లనున్నారు కాబట్టి వారాహి యాత్ర మీటింగ్ లు ఉంటే పోస్టుపోన్ చేయబడతాయి.