త్వరలోనే విశాఖకు సీఎం క్యాంప్ ఆఫీస్ : వైవీ సుబ్బారెడ్డి

-

వైయస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుండి విశాఖ వేదికగా పరిపాలన రాజధాని ఉండబోతుందని, త్వరలోనే విశాఖ నుండి పాలన ప్రారంభం అవుతుందని అనేకమార్లు ప్రకటనలు చేశారు. అయితే అది ఈ నాటికీ నెరవేరలేదు. ఇక తాజాగా విశాఖకు సీఎం జగన్ షిఫ్ట్ కాబోతున్నారని, త్వరలోనే పాలన అక్కడ నుండి మొదలవుతుందని టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలతో ప్రస్తుతం ఆసక్తికరచర్చ జరుగుతుంది. విశాఖకు సీఎం జగన్ షిప్ట్ కాబోతున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తేల్చి చెప్పారు. ఈ విషయం డైరెక్ట్ విశాఖ కార్పొరేటర్లతోనే చెప్పారు. దీంతో విశాఖకు సీఎం జగన్ వెళ్లబోతుంది ఖాయంగా కనిపిస్తోంది.

YV Subba Reddy's Wiki page turns into 'religious battlefield' - The Hindu

కాగా జీవీఎంసీ కార్పొరేటర్లతో వైవీ సుబ్బారెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విశాఖకు సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రారంభంకాబోతోందని చెప్పారు. వీలైతే ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో సీఎం కూడా వస్తారని స్పష్టం చేశారు. న్యాయపరమైన అడ్డంకులు వల్లే కాస్త ఆలస్యమైందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. మరోవైపు విశాఖ రుషికొండ సమీపంలో సీఎం జగన్ క్యాంపు ఆఫీసు నిర్మాణం జరుగుతోంది. సీఎంవో ఆఫీసుతో ముఖ్యమంత్రి కూడా పక్కనే పక్కనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ రెండు నిర్మాణాలు కూడా పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలో వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలు.. సీఎం షిష్ట్ అవుతున్నారని చాలా క్లియర్‌గా అర్ధమయిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news