వచ్చే ఎన్నికల్లో మా మద్దతుతోనే కేంద్ర ప్రభుత్వ ఏర్పాటు – మార్గాని భరత్

-

పార్లమెంటులో విభజన చట్టం అమలు కోసం తమ వంతు పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని అన్నారు వైసీపీ ఎంపీ మార్గాని భరత్. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాతో ఏపీని ఆశీర్వదించాలని అన్నారు. వచ్చే ఎన్నికలలో మా మద్దతుతోనే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు అవడం ఖాయం అనే ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 25 కు 25 ఎంపీ స్థానాలు వైసీపీ గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటో ఆలోచించుకోవాలని అన్నారు. పాచిపోయిన లడ్డులు అంటూ ఎన్డీఏ నుండి బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు ఎన్డీఏ తో కలుస్తున్నారని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ వల్ల ఏపీకి ఒరిగింది ఏంటని ప్రశ్నించారు మార్గాని భరత్. ఏపీకి బిజెపి ఏం చేసిందని నిలదీశారు. రాబోయే ఎన్నికలలో 25 ఎంపీ సీట్లను గెలిపిస్తే వైసిపి మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు అవుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news