ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..అర్చకులకు ఇకపై పదవీ విరమణ ఉండదు..!

-

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలోని అర్చకులకు ప్రభుత్వం తీపిక కబురు అందించింది. వారికి ఉద్యోగ భద్రత కల్పించింది. శరీరం సహకరించినంత వరకు అర్చకులుగా సేవలు చేయవచ్చని పేర్కొంటూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇకపై అర్చకులు పదవి విరమణ లేకుండా టెంపుల్స్ లో సేవ చేయవచ్చు. శరీరం సహకరించకపోతే ఎప్పుడైనా పదవి విరమణ పొందవచ్చు.

ఇక అటు తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది టీటీడీ పాలక మండలి. ఇవాళ ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి. ఇవాళ అక్టోబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టిక్కేట్లను విడుదల చెయ్యనుంది. కళ్యాణోత్సవం, ఉంజల్ సేవా, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టిక్కేట్లు విడుదల చేయనున్న టిటిడి…ఈ నెల 24వ తేదిన అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షణ టోకేన్లు విడుదల చెయ్యనుంది.

Read more RELATED
Recommended to you

Latest news