కోర్టులో వాలంటీర్‌ పిటీషన్‌…పవన్‌ కళ్యాణ్‌ కు బిగ్‌ రిలీఫ్‌

-

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వాలంటీర్ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో విజయవాడ సిటీ సివిల్ కోర్టు బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. పవన్‌ కళ్యాణ్ వ్యాఖ్యల వల్ల తనకు పరువు నష్టం కలిగిందని వాలంటీర్ దాఖలు చేసిన కేసులో పిటీషన్ ను రిటర్న్ చేసింది విజయవాడ సిటీ సివిల్ కోర్టు.

పవణ్ కళ్యాణ్ ఏలూరులో చేసిన వ్యాఖ్యలు విజయవాడ కోర్టు పరిధిలోకి వస్తుందా లేదా అని ప్రశ్నించిన న్యాయస్థానం….ఈ కేసులో వాలంటరీకి సంబంధించిన ఒరిజినల్ అపాయింట్ మెంట్ లెటర్ తమ ముందు ఉంచాలని ఆదేశించింది. డిఫర్మేశన్ కు సంబంధించి విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి గల కారణాలు తెలపాలని పిటిషనర్ కు ఆదేశాలు జారీ చేసింది. పవన్ కల్యాణ్ ఏలూరులో చేసిన వ్యాఖ్యలకు విజయవాడ పరిధిలోకి ఏ విధంగా వర్తిస్తాయో తెలియచేయాలని వెల్లడించింది న్యాయస్థానం. దీంతో పూర్తి వివరాలతో కూడిన పిటీషన్ ను మరోసారి దాఖలు చేయనున్నారు పిటిషనర్.

Read more RELATED
Recommended to you

Latest news