నిరుపేదలకు జగనన్న సురక్ష ఒక శ్రీరామరక్ష – మంత్రి ధర్మాన

-

శ్రీకాకుళం: రాష్ట్రంలో పాలన రంగంలో సరికొత్త మార్పులు వస్తున్నాయని అన్నారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగనన్న సురక్ష ద్వారా ప్రభుత్వం ఉచితంగా 11 రకాల సేవలు ఒక నయా పైసా తీసుకోకుండా అందిస్తుంది అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇంతవరకు 3.33 లక్షల కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు 773 సచివాలయాల ద్వారా అందజేశామని తెలిపారు.

పరిపాలనలో ఒక వినూత్నమైన తరహా ఆలోచన చేపట్టామని.. సీఎం జగన్ పేదలకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. నిస్సహాయులకు, నిరుపేదలకు జగనన్న సురక్ష ఒక శ్రీరామరక్ష అని అన్నారు. జగనన్న సురక్ష పకడ్బందీగా అమలు చేయడం వల్ల గణనీయంగా ఫలితాలు వస్తున్నాయని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news