ఇంటర్మీడియట్‌లో ఇంజనీరింగ్ చేయాలంటే బైపీసీ చేయాలి – చంద్రబాబు

-

ఇంటర్మీడియట్‌లో ఇంజనీరింగ్ చేయాలంటే బైపీసీ చేయాలని చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. నేను చెప్పంగ చెప్పంగ విని మీరు టెక్నాలజీలో నంబర్ 1 అయిపోయారని చంద్రబాబు తెలిపారు. ఈ వ్యాఖ్యలను విజన్ 2046 కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు అన్నారు.

ఇది ఇలా ఉండగా, ఇటివలే కన్నుమూసిన గద్దర్‌ను భయం అంటే ఏంటో తెలియని వ్యక్తిగా టీడీపీ అధినేత చంద్రబాబు అభివర్ణించారు. మంగళవారం గద్దర్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1997లో గద్దర్‌పై కాల్పులు జరిగిన ఘటనపై స్పందించారు. కాల్పుల ఘటనకు సంబంధించి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news