దిల్లీ-పుణె విమానానికి బాంబు బెదిరింపు ఫోన్‌కాల్‌

-

విమానంలో బాంబు ఉందంటూ కొందరు ఆకతాయిలు ఫోన్‌ చేసి బెదిరించే సంఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువగా జరుగుతున్న విషయం తెలిసిందే. దీనివల్ల సిబ్బందితోపాటు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిసార్లు భయంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోవడంతో కొంత మంది గుండెపోటుకు కూడా గురవుతున్నారు.

తాజాగా ఇవాళ ఉదయం దిల్లీ నుంచి పుణె బయల్దేరిన విస్తారా ఎయిర్‌లైన్స్‌కు కూడా బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది దిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేసి.. విమానం మొత్తం తనిఖీలు చేశారు. బాంబు లేదని నిర్దారించుకున్న తర్వాత విమానం ఆలస్యంగా బయల్దేరినట్లు విమానాశ్రయ సిబ్బంది తెలిపారు. దీనిపై విమానాశ్రయ సిబ్బంది దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

‘‘ఇవాళ ఉదయం దిల్లీ ఇందిరాగాంధీ విమానాశ్రయంలో ఉన్న జీఎంఆర్‌ కాల్‌ సెంటర్‌కు దిల్లీ-పుణె విస్తారా విమానంలో బాంబు ఉందని ఫోన్‌ వచ్చింది. వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేసి విమానాన్ని అత్యవసర ల్యాండింగ్‌ చేశాం. భద్రతా సిబ్బంది విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. విమానంలో ఎలాంటి బాంబును గుర్తించలేదు’’అని విమానాశ్రయ అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news