ఇవాళ చంద్రబాబుతో యార్లగడ్డ వెంకట్రావు భేటీ

-

కృష్ణాజిల్లా గన్నవరంలో వైసీపీ పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. ఇవాళ టిడిపి అధినేత చంద్రబాబుతో యార్లగడ్డ వెంకట్రావు భేటీ కానున్నారు. ఈ మేరకు ఇవాళ ఉదయం 11.30 నిమిషాలకు అపాయింట్మంట్ ఖరారు చేసింది టీడీపి అధిష్టానం.

చంద్రబాబుతో భేటీ నేపథ్యంలో హైదరాబాద్ చేరుకున్న యార్లగడ్డ వెంకట్రావు..మరో వారం రోజుల్లోనే టీడీపీ పార్టీలో చేరనున్నారు. గన్నవరం టికెట్‌ ఫైనల్‌ కావడంతో…టీడీపీ పార్టీలో చేరనున్నారు యార్లగడ్డ వెంకట్రావు.

గన్నవరంలో వైసీపీ వర్సెస్ వైసీపీగా సాగుతున్న రాజకీయంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో అమీతుమీ సాగిస్తున్న గత ఎన్నికల అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావు.. ఇటీవలే టీడీపీలోకి వెళ్తున్నా అనే విధంగా  వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే చంద్రబాబును కలుస్తాను, అపాయింట్ మెంట్ ఇవ్వాలని చంద్రబాబు ని కోరుతున్నాను అని మాట్లాడాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news