మహిళలకు రిజర్వేషన్లు కావాలి : కవిత ట్వీట్

-

తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై కల్వకుంట్ల కవిత ఫైర్‌ అయ్యారు. 33% మహిళా రిజర్వేషన్ కావాలంటున్న బీఆర్ఎస్… నిన్నటి లిస్టులో ఆరుగురు మహిళలకే సీట్లు ఇవ్వడం ఏంటని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వాక్యాలపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. ‘మీ రాజకీయ అభద్రతను మహిళా ప్రాతినిధ్యానికి ముడి పెట్టొద్దు.

మహిళా రిజర్వేషన్లపై బిజెపి రెండుసార్లు మోసం చేసింది. సంఖ్యా బలం ఉన్న బిల్లులను బిజెపి ఎందుకు ఆమోదించట్లేదు? చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల బిల్లును తీసుకురావాలి’ అని ఆమె డిమాండ్ చేశారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టాన్ని తీసుకురండని కోరారు కవిత. మీ రాజకీయ అభద్రతాభావాన్ని మహిళా ప్రాతినిధ్యానికి ముడి పెట్టకండని తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news