ఏపీలోని పొదుపు సంఘాల మహిళలకు గుడ్‌న్యూస్

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పొదుపు సంఘాల మహిళలకు అదిరిపోయే శుభవార్త అందింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు పొదుపు సంఘాల రుణాలపై వడ్డీ తగ్గించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంగీకారం తెలిపింది. ఈ మేరకు రుణాలపై వడ్డీ తగ్గించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కీలక ప్రకటన చేసింది ఎస్బిఐ.

ఐదు లక్షల పైబడిన మొత్తాలపై 12.15 శాతం ఉండే వడ్డీ రేటును 2.25 శాతం తగ్గించి 9.90 శాతానికి ఇచ్చేందుకు సమ్మతమైంది. ఇక పది లక్షల రూపాయల పైన రుణాలపై 2.45 శాతం తగ్గించి 9.70 శాతం వడ్డీ విధించనుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పొదుపు సంఘాల రుణాలలో నాలుగో వంతు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఉన్నాయి. ఈ తగ్గింపుతో 100 కోట్ల వడ్డీ భారం తగ్గుతుందని అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news