BREAKING : ఇవాళ పులివెందులకు వైఎస్ షర్మిల

-

BREAKING : ఇవాళ కడప జిల్లా పులివెందులకు వైఎస్ షర్మిల వెళ్లనున్నారు. రేపు వైఎస్ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో నివాళులు అర్పించనున్నారు షర్మిల. ఇందులో భాగంగానే ఇవాళ కడప జిల్లా పులివెందులకు వైఎస్ షర్మిల వెళ్లనున్నారు. ఈ మేరకు షర్మిల అనుచరులు అన్ని ఏర్పాట్లు చేసారు.

కాగా, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో నిన్న భేటీ అయ్యారు. ష‌ర్మిల త‌న పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయ‌నున్నార‌నే ప్ర‌చారం నేప‌ధ్యంలో.. సోనియాతో స‌మావేశం కావ‌డం రాజ‌కీయ ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ఢిల్లీలో సోనియా నివాసంలో బ్రేక్ ఫాస్ట్ భేటీలో దాదాపు గంట‌న్న‌ర పాటు వీరి మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగాయి. ష‌ర్మిల భ‌ర్త‌ బ్రదర్ అనిల్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే వ‌చ్చే లాభాలు, హామీలు, ప్రాధాన్య‌త‌ల‌ నేప‌ధ్యంలోనే ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news