హైదరాబాద్ నుండి డివైన్ కర్ణాటక ప్యాకేజీ.. తక్కువ ధరకే విమానంలో.. ఈ ప్రదేశాలన్నీ చూడచ్చు..!

-

ఎన్నో రకాల టూర్ ప్యాకేజీలని IRCTC తీసుకు వస్తూ వుంది. డివైన్‌ కర్ణాటక పేరుతో ఐదు రాత్రులు, ఆరు పగళ్లు టూర్‌ ప్యాకేజీని తీసుకు రావడం జరిగింది. ఈ ప్యాకేజీ ద్వారా కర్ణాటకలోని ధర్మస్థల, గోకర్ణ, హొరనాడు, కొల్లూరు, మంగళూరు, మురుడేశ్వర, శృంగేరి, ఉడుపి ఇవన్నీ కూడా మనం చుట్టేసి రావచ్చు. ఇక పూర్తి వివరాలు చూస్తే.. రూ. 30,550 నుంచి కూడా ఈ టూర్ మొదలు కానుంది. అక్టోబర్‌ 8న ఈ టూర్ స్టార్ట్ కానుంది. మొదటి రోజు హైదరాబాద్ నుంచి ఈ టూర్ స్టార్ట్ట్ కానుంది. మంగళూరు విమానాశ్రయానికి రీచ్ అయ్యాక ఐఆర్‌సీటీసీ సిబ్బంది పికప్ చేసుకొని హోటల్‌కు తీసుకు వెళ్లారు.

అక్కడ అల్పాహారం అయ్యాక మంగళ దేవి ఆలయం, కద్రి మంజునాథ ఆలయాన్ని చూడవచ్చు. సాయంత్రం తన్నెరభావి బీచ్, కుద్రోలి గోకర్నాథ ఆలయాలని చూసి… రాత్రికి డిన్నర్‌ చేసి మంగుళూరులోనే ఉండాలి. ఉడుపీకి వెళ్ళాలి నెక్స్ట్ డే. సెయింట్ మేరీస్ ద్వీపం, మాల్పే బీచ్ చూస్తారు. సాయంత్రం శ్రీ కృష్ణ ఆలయాన్ని చూడవచ్చు. ఉడుపీ నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న హొరనాడుకు వెళ్ళాలి ఆ తరవాత రోజు.

శృంగేరికి వెళ్లి ఆలయాన్ని సందర్శింస్తారు. సాయంత్రం తిరిగి ఉడుపీకి వచ్చేయాలి. ఉడిపి – కొల్లూరు – గోకర్ణ – మురుడేశ్వర్ నాల్గవ రోజు ఉంటుంది. మురుడేశ్వర్ – ధర్మస్థల – కుక్కే ఐదవ రోజు. ఆరవ రోజు సుబ్రహ్మణ్య ఆలయాన్ని చూడవచ్చు. మధ్యాహ్నం మంగుళూరుకు చేరుకొని సాయంత్రం 7 గంటలకు మంగళూరు లో ఫ్లైట్ ఉంటుంది. ఇలా టూర్ ముగుస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news