వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ మూడు వారాలు వాయిదా !

-

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి సొంత ఇంట్లోనే హత్యకు గురైన విషయం తెలిసిందే. హత్య జరిగిన ఇంతకాలం అవుతున్న ఈ కేసు లో వీరే ప్రధాన ముద్దాయిలు అంటూ కోర్ట్ లు నిర్ధారించి శిక్షలు వేయడం ఇంకా పూర్తి కాలేదు. కానీ సిబిఐ కొందరిని అనుమానంతో కొన్ని సాక్ష్యాలు ఆధారంగా చేసుకుని అరెస్ట్ లు చేసి విచారించింది. మరి కొందరిని అరెస్ట్ చేసే క్రమంలో కోర్ట్ లో కేసులు నడుస్తున్నాయి. ఇక తాజాగా ఈ కేసులో నాంపల్లి సిబిఐ కోర్ట్ లో విచారణ స్టార్ట్ కాగా… ఈ విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉదయ్ శంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి మరియు ఉదయ్ కుమార్ రెడ్డి లు హాజరవ్వడం జరిగింది.

ఈ సిబిఐ కోర్ట్ ఇరు పక్షాల లాయర్ల వాదనలు విన్న తర్వాత విచారణను సెప్టెంబర్ 22వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. ఇంకా ఎంతకాలం ఈ కేసుకు పుల్ స్టాప్ పడుతుందో తెలియడం లేదు..

Read more RELATED
Recommended to you

Latest news