టీం ఇండియాకు హేడెన్ హెచ్చరిక … పాక్ బౌలర్లతో జాగ్రత్త !

-

శ్రీలంక మరియు పాకిస్తాన్ లు వేదికలుగా ఆసియా కప్ జరుగుతోంది. ఇందులో మొత్తం ఆరు జట్లు టైటిల్ కోసం పోటీ పడుతున్నాయి. కాగా ఇప్పటికే రెండు మ్యాచ్ లు పూర్తి కాగా .. రెండు మ్యాచ్ లలో పాకిస్తాన్ శ్రీలంకల తమ మొదటి మ్యాచ్ లలో విజయాన్ని సాధించాయి. ఇక రేపు మధ్యాహ్నం పాకిస్తాన్ మరియు ఇండియా ల మధ్యన ఆసక్తికర సమరం జరగనుంది. కోట్లాది మంది అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. కాగా ఇది వన్ డే కావడం వలన ఇంకా ఎక్కువగా ఎంటర్ టైన్మెంట్ ఉండే అవకాశం ఉంది. తాజాగా ఈ మ్యాచ్ గురించి కామెంటేటర్ మరియు ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ హేడెన్ మాట్లాడుతూ .. రేపు ఇండియా పాకిస్తాన్ తో ఆడనుండడం నాకు ఎంతో ఆసక్తిగా ఉందని చెబుతూనే, పాకిస్తాన్ బౌలర్లు చాలా డేంజర్, వారితో ఇండియా ఆటగాళ్లు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశాడు హెడెన్.

మరి పాకిస్తాన్ ను ఇండియా తమదైన అద్భుతమైన ఆటతీరుతో ఓడిస్తారా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news