ఓయ్ ముద్దపప్పు నోరు లేస్తోంది.. ఎంపీ భరత్ లోకేష్ కి వార్నింగ్..!

-

టీడీపీ నేత నారా లోకేష్ పై రాజమహేంద్ర వరం ఎంపీ మార్గాని భరత్ రామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల గ్రామంలో రెండు కోట్లతో నిర్మించనున్న వెంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజల కోసం చేసేదానిని పాదయాత్ర అంటారు. ఒళ్లు తగ్గించుకోవడానికి చేసేదానని పాదయాత్ర అనరంటూ విమర్శలు గుప్పించారు.

ప్రజలు పడుకున్న తరువాత అర్థరాత్రి సమయంలో చేసే యాత్రను ఏమంటారో నారా లోకేష్ సమాధానం చెప్పాలన్నారు. గూగుల్ లో పప్పు అని కొడితే నారా లోకేష్ ని చూపిస్తుందని.. దొడ్డిదారిన ఎమ్మెల్సీగా మంత్రిగా నారా లోకేష్ టీడీపీ అమలు చేయలేని పథకాలతో ప్రజలను మోసం చేసేందుకు మరోసారి ప్రయత్నం చేస్తుందన్నారు. రాష్ట్రంలో పోటీ 20 లక్షల మంది మహిళలుంటారు. వారిలో బీపీఎల్ కింద 80 లక్షల సిలిండర్లు ఉచితంగా అందిస్తారా ? టీడీపీ స్పస్టంగా చెప్పాలన్నారు. పెన్షన్ కి, ఇన్సూరెన్స్ పథకానికి తేడా తెలియని నారా లోకేష్ కి సీఎంకి విమర్శించే స్థాయి లేదని ఎంపీ భరత్ ఆగ్రహం వ్యక్తం చేసారు. 

Read more RELATED
Recommended to you

Latest news