బీఆర్ఎస్ షేక్ అయ్యేలా పోరాటం చేద్దాం – పొంగులేటి

-

ఖమ్మం: ఈనెల 17న కాంగ్రెస్ పార్టీ చేపట్టిన విజయభేరిని విజయవంతం చేసేందుకు నేడు ఖమ్మం డిసిసి కార్యాలయంలో సమావేశం అయ్యారు పార్టీ ఇంచార్జ్ మహమ్మద్ అరిఫ్ నసీం ఖాన్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్, వి హనుమంతరావు, తదితరులు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ పొంగులేటి మాట్లాడుతూ.. పార్టీకి నష్టం కలిగించే విధంగా కార్యకర్తలు ఎవరు వ్యవహరించవద్దని కోరారు. అందరం కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు.

మన పోరాటం 17న జరిగే మీటింగ్ లో చూపిద్దాం అన్నారు పొంగులేటి. బీఆర్ఎస్ షేక్ అయ్యే విధంగా మన పోరాటం చేద్దామన్నారు. రాబోయే రోజుల్లో ఉమ్మడి జిల్లాలో అందరం ఒకే తాటి మీదకి వస్తామని.. పదికి పది సీట్లు గెలుస్తామని అన్నారు. కొంతమంది పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారుతున్నారని మండిపడ్డారు. మనల్ని నమ్ముకున్న నాయకులకు నష్టం రాకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు పొంగులేటి. పార్టీలో అందరికీ న్యాయం జరుగుతుందని.. పెద్దలందరం కలిసి పని చేస్తామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news