పవన్ కల్యాణ్ ను ఏరా.. అంటూ రెచ్చిపోయిన కత్తి మహేశ్..!

-

పవన్ కల్యాణ్ బద్ద శత్రువగా పేరుబడిన నటుడు, దర్శకుడు, సినీ క్రిటిక్ కత్తి మహేశ్ మరోసారి ఆయనపై విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్ ఏపీ రాజధాని గురించి .. జగన్ కేసు గురించి చేసిన వ్యాఖ్యలతో మళ్లీ కత్తి మహేశ్ మళ్లీ నోటికి పని కల్పించాడు. తాజాగా ఏపీ రాజధాని గురించి పవన్ మాట్లాడుతూ.. రాజధాని పులివెందులకు తరలించకుకోండి.., హైకోర్టు కర్నూలుకు తీసుకెళ్లండి.. మీకు కోర్టుకు వెళ్లడానికి ఖర్చు తగ్గుతుంది అంటూ జగన్ ను ఉద్దేశించి సెటైర్లు పేల్చారు.

ఇప్పుడు కత్తి మహేశ్ ఆ కామెంట్లపై రాయలసీమ వాసిగా స్పందించాడు.. ఏరా పవన్ కళ్యాణ్ అని ఆయన సంభోదిస్తూ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు. పుండాకోర్, మళ్లీ గుండు కావాలా? అంటూ పరుషమైన పదజాలాన్ని వాడారు.. ఇక ఇప్పుడు ఈ పోస్టుల వివాదంతో మరోసారి పవన్ ఫ్యాన్స్ కత్తి మహేశ్ పై విరుచుకుపడటం ఖాయంగా కనిపిస్తోంది. అంత ఘాటుగా ఉంది మరి ఆ పోస్ట్.

ఇంతకీ ఆ పోస్టులో ఏముందంటే.. ‘‘ఏరా పవన్ కళ్యాణ్… పులివెందులలో రాజధాని, కర్నూలులో హైకోర్టు పెట్టుకోమని ఏకసెక్కలాడతావా? న్యాయబద్ధంగా రాయలసీమ ప్రజల హక్కులురా అవి పుండాకోర్! నీకు అది మజాక్ గా అనిపిస్తోందా? మళ్ళీ గుండు కావాలని కోరిక ఏమైనా కలుగుతోందా నీకు! ఖబడ్దార్ !!’’ అని కత్తి మహేశ్ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.

ఇదేం భాష మహేష్.. ఇలా మాట్లాడకు అని కొందరు సలహా ఇస్తే.. కత్తి మహేశ్ మాత్రం.. పవన్ కళ్యాణ్ లాంటి బాధ్యతలేని బరితెగించి బానిసకు ఇంతకుమించిన మంచి భాష నా దగ్గరలేదు. నిజానికి నేను చాలా మర్యాదగానే ఇప్పటికి రాస్తున్నా. మీరు చిత్తగించాలి అంటూ బదులివ్వడం విశేషం. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాయలసీమకు రాజధాని రావాల్సిన విషయాన్ని కూడా కత్తి మహేశ్ గుర్తు చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news