“టీడీపీ – జనసేన” పొత్తు ప్లస్ అవుతుందా ?

-

నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ను కలవడానికి వెళ్ళాడు. ఆయనను కలిసిన అనంతరం మీడియా సమావేశంలో నారా లోకేష్ మరియు బాలకృష్ణ లతో ఉండగా పవన్ కళ్యాణ్ సంచలనం వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పాడు.. అంతే కాకుండా జనసేన టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్లనుంది అంటూ ప్రకటించి అటు జనసేనకు మరియు వైసీపీకి షాక్ ఇచ్చాడని చెప్పాలి. గతంలో ఇదే విధంగా టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లగా విజయం సాధించి అధికారంలోకి వచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజలకు అవసరం అయిన అన్ని వనరులను సమకూరుస్తూ ఒక వర్గం ప్రజలకు జగన్ దేవుడై పోయాడు. మరి టీడీపీ, జనసేన మరియు బీజేపీలు కలిసి వెళ్లినా వైసీపీ కి పెద్ద నష్టం ఉండబోదని పొలిటికల్ విశ్లేషకులు చెబుతున్నారు.

మరి పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు పొత్తుల గురించి ప్రకటిస్తామని చెప్పి ముందుగానే చెప్పడంతో.. ఎవరికీ ప్లస్ కానుంది అన్న విషయం తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news