యూజర్లకు షాక్.. ఇక నుంచి ట్విటర్ (ఎక్స్) వాడాలంటే నెల నెలా చెల్లించాల్సిందే

-

ట్విటర్‌లో (ప్రస్తుతం ఎక్స్‌)ను హస్తగతం చేసుకున్న ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ అందులో పెను మార్పులు చేశారు. కంపెనీ బాస్​ను తొలగించడం నుంచి ఉద్యోగుల తొలగింపు.. బ్లూటిక్ వంటి ఎన్నో మార్పులు తీసుకువచ్చారు. అయితే తాజాగా మరో పెద్దమార్పునకు నాంది పలుకుతున్నారు ఎలాన్ మస్క్. ఇక నుంచి ఎక్స్ సేవలు వాడాలంటే ప్రతి యూజర్ ఎంతో కొంత చెల్లించాల్సిందేనట. ఈ విషయాన్ని మస్క్ స్వయంగా వెల్లడించారు. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుతో చర్చిస్తున్న సందర్భంగా తన మనసులో మాటను బయటపెట్టారు.

ఇక నుంచి ఎక్స్‌ను వాడే వారు ప్రతి నెలా ‘స్వల్ప మొత్తం’ చెల్లించాల్సి ఉంటుందని మస్క్‌ పేర్కొన్నారు. అయితే ఈ నిర్ణయం వెనక ఓ కారణం ఉందని తెలిపారు. ఎక్స్‌లో ఉన్న బాట్స్‌ను తొలగించేందుకు ఇదే సరైన మార్గమని.. ప్రస్తుతం ఎక్స్‌లో 550 మిలియన్‌ నెలవారీ యూజర్లు ఉండగా.. సగటున రోజుకు 100-200 మిలియన్‌ పోస్టులు పెడుతుంటారని .. ఇందులో బాట్స్‌ కూడా ఉన్నాయని చెప్పారు. బాట్స్‌ను తొలగించాలంటే స్వల్ప మొత్తంలోనైనా ఫీజు వసూలు చేయడం అవసరమంటూ మస్క్‌ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. దీనివల్ల బాట్స్‌కు అడ్డుకట్ట వేయడానికి వీలవుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news