పోస్టుమార్టానికి తరలిస్తుండగా కదలికలు.. చచ్చి బతికిన పోలీస్!

-

చావు ఒడిలో నుంచి తప్పించుకున్నాడు అని మనం సాధారణంగా అంటుంటాం. కానీ చనిపోయాడని అంత్యక్రియలకు సిద్ధం చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి శరీరంలో కదలికలు వచ్చాయి. వెంటనే ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స చేసి అతడిని మళ్లీ బతికించారు. ఈ ఘటన పంజాబ్‌ రాష్ట్రం లుథియానాలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..?

పోలీసు అధికారి మన్‌ప్రీత్‌ను ఓ విషపురుగు కుట్టగా.. సెప్టెంబరు 15వ తేదీన ఆయన్ను లుథియానాలోని బస్సీ ఆసుపత్రిలో చేర్పించారు. శరీరమంతా ఇన్‌ఫెక్షన్ సోకడంతో వెంటిలేటరుపై ఉంచి వైద్యులు చికిత్స అందించారు. ఈ క్రమంలో సెప్టెంబర్‌ 18వ తేదీ అర్ధరాత్రి మన్‌ప్రీత్‌ మృతి చెందాడని ఆస్పత్రి సిబ్బంది తెలిపారని తండ్రి రామ్‌జీ చెప్పారు. మరుసటిరోజు ఉదయం పోస్ట్‌మార్టం కోసం తరలిస్తుండగా డ్యూటీలో ఉన్న ఓ పోలీసు అధికారి.. మన్‌ప్రీత్‌ శరీరంలో కదలికలను గుర్తించారు. వెంటనే మరో ఆసుపత్రికి తరలించి చికిత్స చేయగా ఆయన తిరికి బతికారని కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, మన్‌ప్రీత్‌ చనిపోయాడని తమ సిబ్బంది ఎవరూ చెప్పలేదని బస్సీ ఆసుపత్రి వైద్యులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news