ఖమ్మంలో దారుణం.. మలద్వారంలో పైప్ పెట్టి గాలి ఎక్కించిన వైనం..!

-

ఖమ్మం జిల్లాలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. తోటి కార్మికుడు క్షనిక ఆవేశానికి గురై ఓ వ్యక్తిని చావు బతుకుల్లో కొట్టుమిట్టాడేందుకు కారకుడు అయ్యాడు. ఇలాంటి ఘటన చాలా అరుదు అనే చెప్పాలి. ఇప్పటివరకు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం, చంపుకోవడం వంటివి చేసుకున్నారు. కానీ తాజాగా కిరాతకంగా మలద్వారంలో పైప్ పెట్టి గాలి ఎక్కించారు.

ఈ ఘటన వినడానికి కాస్త వింతగా ఉంది. ఖమ్మం జిల్లాలోని ఆరెంపుల గ్రామ పరిధిలోని ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో కార్మికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా కోపోద్రిక్తులైన కొంతమంది కార్మికులు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఓ కార్మికుడి మలద్వారంలో గ్రానైట్ పాలిషింగ్ ఎయిర్ పైపు పెట్టి గాలి ఎక్కించారు. కడుపు ఉబ్బడంతో ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగానే ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news