టీడీపీ ‘మోత మోగిద్దాం’ కార్యాచరణపై మంత్రి అంబటి సెటైర్‌

-

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబుకు మద్దతుగా రేపు రాత్రి 7 గంటల నుంచి ఐదు నిమిషాల పాటు ‘మోత మోగిద్దాం’ కార్యాచరణకు టీడీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అందుబాటులో ఏది ఉంటే అది మోగించాలని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీనిపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. “విధి విచిత్రమైనది! నాడు కాపు ఉద్యమంలో పళ్లాలు కొట్టినవారిని మక్కెలు విరగ్గొట్టి బొక్కలో వేశావ్! ఇప్పుడు అవినీతిలో కేసులో బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్.. వారేవా!” అంటూ ఎక్స్ లో పోస్టు చేశారు.

Pawan Kalyan's main goal in to make Chandrababu a CM: Ambati Rambabu

ఇదిలా ఉంటే.. మోతమోగిద్దాం పేరుతో టీడీపీ ఓ కొత్త కార్యక్రమానికి పిలుపునిచ్చింది. నియంత ముందు మొర పెట్టుకుంటే ఫలితం ఉండదని.. అధికార మత్తు వదిలేలా మోత మోగించాల్సిందేనని టీడీపీ తెలిపింది. చంద్రబాబు గారికి మద్దతుగా… సెప్టెంబర్ 30, రాత్రి 7 గంటల నుండి 7.05 వరకు 5 నిమిషాల పాటు ప్యాలెస్ లో ఉన్న సైకో జగన్ కి వినిపించేలా ఏదో ఒక రకంగా మోత మోగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మీరు ఏం చేసినా దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలని టీడీపీ సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news