ఫ్లోరోసిన్ ను పెంచి పోషించింది కాంగ్రెస్సే : మంత్రి కేటీఆర్

-

ఈ రోజు తెలంగాణ మంత్రి కేటీఆర్ నల్గొండ జిల్లా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ రాష్ట్రంలో త్వరలోనే ఎన్నికలు జరగనుండడంతో అన్ని రాజకీయ పార్టీలు ఏ జిల్లాలో మన పార్టీ పరిస్థితి ఏవిధంగా ఉందన్న విషయాన్ని తెలుసుకోవడానికి పర్యటనలు చేస్తున్నారు. అందులో భాగంగానే అధికార పార్టీ మంత్రి నల్గొండకు వెళ్లడం జరిగింది.. ఇక్కడ జరిగిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతూ ఈ జిల్లాలో ఫ్లోరిసిన్ ఎంత తీవ్రంగా ఉన్నదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.. ఈ ఫ్లోరోసిన్ ను పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీ అని మీకు తెలిసిందే అన్నారు.. కానీ ప్రజల శ్రేయస్సును కోరుకునే మా సీఎం కేసీఆర్ ఈ జిల్లాలో ఫ్లోరోసిన్ ను తరిమి కొట్టిన మొనగాడు అంటూ గొప్పగా చెప్పుకున్నారు మంత్రి కేటీఆర్.

ఇక ఈ జిల్లా కోసం గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు. ఇలా కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను మేమంటే అస్సలు ఇష్టంలేని మోదీ కూడా ఒక సమయంలో ఈ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నట్లు కేటీఆర్ అందరికీ గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news