కలాం నా దగ్గరే విజన్‌ నేర్చుకున్నారు.. చంద్ర‌బాబు

-

చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని మామండూరు వద్ద మూడు రోజుల జిల్లాస్థాయి టీడీపీ విస్తృతస్థాయి సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే చిత్తూరు జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత‌ చంద్రబాబునాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. మాజీ రాష్ట్రపతి, అపర మేధావి అబ్దుల్ కలాం తనవద్దే విజన్ నేర్చుకున్నారని వ్యాఖ్యానించారు. నేను సీఎంగా ఉన్నప్పుడు విజన్‌–2020తో ముందుకెళ్లాను.. నా విజన్‌ గురించి తెలుసుకున్న దివంగత రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం.. ఆ విజన్‌కు సంబంధించిన పలు పత్రాలను తీసుకెళ్లి దేశ ఆర్థిక విజన్‌పై ఓ పుస్తకాన్ని విడుదల చేశారు’ అని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారు.

అదే విధంగా, గతంలోనే అగ్రిగోల్డ్‌ బాధితులకు తెలుగుదేశం ప్రభుత్వం పరిహారం చెల్లించేందుకు సిద్ధమైందని, ఎన్నికల కోడ్‌ రావడంతో అది కుదరలేదని అన్నారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం బడ్జెట్ లో పెట్టిన దానికంటే తక్కువ ఇవ్వడంలో అర్ధమేమిటని వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లాలో టీడీపి కార్యకర్తలపై దాడులు ఎక్కువయ్యాయని ఆయన అన్నారు. సీఎం జగన్ కు తన తాత బుద్ధులు వచ్చాయని అందువల్లే ఇలా చేస్తున్నాడని ఆరోపించారు

Read more RELATED
Recommended to you

Latest news