కాంగ్రెస్ బస్సు కు బ్రేక్… అభ్యర్థుల ప్రకటన తర్వాతే ఏదైనా ?

-

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ కాంగ్రెస్ బస్సు యాత్రకు బ్రేక్ వేస్తు కీలక నిర్ణయం తీసుకుంది అధిష్టానం. ఈనెల 15వ తేదీన ప్రారంభం కావాల్సిన తెలంగాణ కాంగ్రెస్ బస్సు యాత్ర దసరా తర్వాత రోడ్డు ఎక్కాలా కనిపిస్తోంది.

Break to Congress bus
Break to Congress bus

అభ్యర్థుల ఎంపిక పూర్తి కాకుండా క్షేత్రస్థాయికి వెళితే అసలు ప్రయోజనం ఉండదని కాంగ్రెస్ అధిష్టానానికి చాలా ఫిర్యాదులు వచ్చాయట. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ బస్సు యాత్రను దసరా తర్వాత ప్రారంభించేందుకు అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది.

అభ్యర్థుల ప్రకటన మరియు టికెట్ దక్కని నేతల అసమ్మతి చల్లారాక యాత్రను ప్రారంభిస్తే… మంచిదని ఓ నిర్ణయానికి వచ్చిందట కాంగ్రెస్ అధిష్టానం. టికెట్ల ప్రకటనతో యాత్ర ప్రారంభించి ఎన్నికల వరకు కొనసాగించే ఛాన్స్ ఉంది. ఇది ఇలా ఉండగా అక్టోబర్ 16వ తేదీ లేదా 18వ తేదీన అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news