చంద్రబాబు నాయుడు పై మరో కేసు నమోదు

-

చంద్రబాబు నాయుడిపై మరో కేసు నమోదు అయింది. గత ప్రభుత్వంలో ఇసుక అక్రమాలపై కేసు నమోదు.. ఏపీఎండీసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు.. ఏ-1 గా పీతల సుజాత, ఏ-2గా చంద్రబాబు, ఏ-3గా చింతమనేని ప్రభాకర్‌, ఏ-4గా దేవినేని ఉమ.. మైనింగ్ శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐడీ.. ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం చేకూర్చారని ఫిర్యాదు.. ఫ్రీ శాండ్ పాలసీ విధానం, అమలులో అవకతవకల పై సీఐడీ ఫోకస్.. ఉచిత ఇసుక పేరుతో సహజ వనరుల హద్దు లేకుండా అక్రమ తవ్వకాలకు ఆస్కారం ఇచ్చారని ‌సీఐడీ అభియోగాలు నమోదు చేసింది.

చంద్రబాబు హయాంలో విచ్ఛలవిడిగా ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయని సీఐడీ ఆరోపిస్తుంది. ఆయన ఇంటి పక్కనే అక్రమ తవ్వకాలు జరిగినా ఆయన పట్టించుకోలేదని సీఐడీ తెలిపింది. 2016-19 మధ్య అక్రమ మైనింగ్ కు వివిధ కేసుల్లో 40 కోట్ల రూపాయల పెనాల్టీ విధించారు. ఇదే విషయాన్ని సీఐడీ ఎఫ్ఐఆర్ లో పొందుపరిచింది. ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం చేకూర్చారని.. మైనింగ్ శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news