నేడు తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన…షెడ్యూల్ ఇదే

-

నేడు తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్‌ కూడా విడుదల అయింది. ఈ షెడ్యూల్‌ ప్రకారం…ఇవాళ సాయంత్రానికి ప్రధాని మోడీ..హైదరాబాద్‌ నగరానికి చేరుకుంటారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక మొదటిసారి తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని మోడీ వస్తున్నారు. ఇప్పటికే అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని ప్రకటించారు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి వర్యులు అమిత్ షా.

Prime Minister Modi’s visit to Telangana today

ఇక ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు ఎల్బీస్టేడియంలో జరిగే బీజేపీ బీసీ ఆత్మ గౌరవ సభలో పాల్గొననున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇవాళ్టి ప్రధాని మోడీ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. ఈ తరుణంలోనే.. ప్రధాని మోడీ ఏమి మాట్లాడుతారు అనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కాగా..తెలంగాణ రాష్ట్ర ఎన్నికల తరుణంలోనే.. బీజేపీతో కలిసి.. తెలంగాణ రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పని చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news