చంద్రమోహన్ మృతిపై కుటుంబ సభ్యుల ప్రకటన…!

-

ఈ రోజు ఉదయమే హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూశారు. ఈయన మరణవార్త టాలీవుడ్ ను తీవ్ర విషాదంలో ముంచివేసింది. చంద్రమోహన్ మరణం పట్ల సీఎం కేసీఆర్, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, ఎన్టీఆర్ లు తమ ప్రఘాడ సానుభూతిని తెలియచేశారు. ఇక కుటుంబ సభ్యులు కొన్ని కీలక విషయాలను తెలియచేశారు. గత నాలుగు సంవత్సరాలుగా చంద్రమోహన్ గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారా, చికిత్స తీసుకుంటున్న సమయంలో ఈ ప్రభావం కిడ్నీలపై పడినట్లు వీరు తెలియచేశారు. తీవ్రత ఎక్కువ కావడంతో ఈ రోజు ఉదయం 8 గంటలకు అపోలో కు తీసుకెళ్ళాము, చికిత్స తీసుకుంటుండగానే 9.45 గంటలకు మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్లిపోయారు అంటూ కన్నీరుమున్నీరయ్యారు కుటుంబ సభ్యులు.

ఇక చంద్రమోహన్ కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, ఒకమ్మాయి అమెరికాలో ఉండగా ఆమెకు కబురు పంపించారు. ఆమె రావడానికి సమయం పడుతుండడంతో సోమవారం అంత్యక్రియలు చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news