కుట్రలతో గెలవాలని చూస్తున్నారు : రేవంత్ రెడ్డి

-

బీఆర్ఎస్ నేతలు డ్రామాలు బాగా చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ పై దాడి జరిగినప్పుడు హరీశ్ రావు బాగా నటించారు. ప్రభాకర్ రెడ్డి పై దాడి వెనుక కాంగ్రెస్ కుట్ర లేదని పోలీసులు తేల్చారు. మరోవైపు అచ్చంపేట ఎమ్మెల్యే బాలరాజుపై దాడి జరగ్గా.. కేటీఆర్ ఇంకా బాగా నటించారు. బీఆర్ఎస్ కుట్రలపై ఈసీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని ప్రశ్నించారు.

ముఖ్యంగా మైనార్టీ డిక్లరేషన్ ప్రకటిస్తే కుట్ర ఎలా అవుతుందని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. కుట్రలతో గెలవాలని చూస్తున్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దాడి గురించి మాపై ఆరోపణలు తగదన్నారు. మరోవైపు కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని పేర్కొంటున్నారు. మరో 15 రోజుల్లో మరిన్నీ కుట్రలు జరుగబోతున్నాయని రేవంత్ రెడ్డి స్పస్టం చేశారు. కాంగ్రెస్ పై జరుగుతున్న కుట్రను ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. రిటైర్డు అధికారులపై ఫిర్యాదు చేస్తే చర్యలు ఏవి అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. కుమారస్వామితో ప్రెస్ మీట్ పెట్టించింది కేసీఆర్ అని పేర్కొన్నారు. డిసెంబర్ 09న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news