ఏపీ ప్రజలకు అలర్ట్.. రెండు రోజుల పాటు వర్షాలు !

-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అలర్ట్. రేపు అంటే నవంబర్ 14 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. తర్వాత ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతుందని తెలిపింది. అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ 16 నాటికి మధ్య, ఆనుకుని ఉన్న దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది.

rain alert on nov 13th

ఆంధ్రప్రదేశ్, యానం మీదుగా తక్కువ ట్రోపోస్పిరిక్, ఈశాన్య గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావం తో ఇవాళ్టి నుంచి నవంబర్ 15 వరకు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలోని ఒకటి, రెండు ప్రదేశాలలో మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ వర్షాలతో ఆయా ప్రాంతాలలో ఉష్ణో గ్రత తగ్గుతుందని తెలిపింది. ఇక దీని ప్రభావంతో నవంబర్ 15 నుంచి ఒడిశాలోని పలు ప్రాంతాల్లో తేలికబడి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news