తెలంగాణకు మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ…. షెడ్యూల్ ఇదే

-

తెలంగాణకు మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. ఈ తరుణంలోనే ప్రధాని మోడీ షెడ్యూల్‌ రిలీజ్‌ అయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బిజెపి నేతలు తెలంగాణ రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు ప్రచారం చేశారు. తాజాగా ప్రధాని మోడీ మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు.

Narendra Modi is once again the prime minister of Telangana

ఈనెల 25న మహేశ్వరం, కామారెడ్డి సభల్లో ప్రధాని పాల్గొననున్నారు. ఆ మరుసటి రోజు నవంబర్ 26న తూప్రాన్, నిర్మల్…. 27న మహబూబాబాద్, కరీంనగర్ సభల్లో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్ లో ప్రధాని రోడ్ షోలో పాల్గొననున్నారు. ఇక ఇటీవల కేంద్ర హోంమంత్రి తెలంగాణ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వమని ఆయన ఆరోపించారు. తెలంగాణ భవిష్యత్తు ఎన్నికల్లో నిర్ణయించబడుతుందని, అవినీతి బీఆర్ఎస్ కు వీఆర్ఎస్ ఇచ్చే సమయం వచ్చిందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గద్వాలలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… అధికార బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ కు వీఆర్ఎస్ ఇచ్చే సమయం వచ్చిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news