ధనుష్ మూవీ అసిస్టెంట్ డైరెక్టర్ అనుమానాస్పద మృతి !

-

లేటెస్ట్ గా తెలుస్తున్న సమాచారం ప్రకారం కోలీవుడ్ లో ఒక విషాద వార్త అందరినీ తీవ్ర దుఃఖ సముద్రంలో ముంచి వేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే అసిస్టెంట్ డైరెక్టర్ మారిముత్తు హఠాత్తుగా మరణించాడు. ధనుష్ హీరోగా చేసిన కర్ణన్ మరియు ఉదయనిధి స్టాలిన్ లేటెస్ట్ గా నటించిన మమన్నాన్ సినిమాలకు దర్శకత్వం వహించిన సెల్వరాజ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. ఇక సెల్వరాజ్ తెరకెక్కించిన మూడు సినిమాలకు ఇతను అసిస్టెంట్ గా పనిచేశాడు. అయితే నిన్న మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం సిగరెట్ తాగుతుండగా సడెన్ గా దగ్గు రావడంతో ఊపిరి ఆడక బాధపడినట్లు తెలుస్తోంది. అయితే అక్కడ ఉన్న సిబ్బంది మరిముత్తును హాస్పిటల్ కు తీసుకువెళుతుండగా మార్గ మధ్యంలోనే చనిపోయినట్లు తెలుస్తోంది.

కానీ పోలీసులు సమాచారం అందుకుని ఈ మృతిని అనుమానాస్పదంగా నోట్ చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరి ఈ మృతిలో ఎవరి హస్తం ఏమైనా ఉందా అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news