తిరుమల శ్రీవారి సన్నిధిలో చంద్రబాబు కుటుంబం

-

టీడీపీ అధినేత చంద్రబాబు తిరుమలకు వెళ్లారు. తిరుమల పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు ఘనస్వాగతం లభించింది. రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమలకు వెళ్లే దారిలో పలుచోట్ల చంద్రబాబుకు టీడీపీ నేతలు ఘనస్వాగతం పలికారు. సతీమణి భువనేశ్వరితో కలిసి చంద్రబాబు తిరుమలకు చేరుకున్నారు.

Chandrababu couple to Tirumala

రాత్రికి తిరుమలలోనే చంద్రబాబు బసచేశారు. ఉదయం శ్రీవారిని చంద్రబాబు దంపతులు దర్శించుకుంటున్నారు. తిరుమల అతిథి గృహం బయట వేచి ఉన్న కార్యకర్తల వద్దకు చంద్రబాబు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. నారా భువనేశ్వరి, చంద్రబాబు నాయుడు తిరుమలకు చేరుకోగా…. వారికి టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు.

ఇది ఇలా ఉండగా డిసెంబర్ 4 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు చేయనున్నారు చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను పార్లమెంట్ వేదికగా ఎండగట్టే విషయమై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు.. రేపు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించు కోనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news