వచ్చే ఎన్నికల్లో వైసీపీ 3 ఎంపీ సీట్లే గెలుస్తుంది ?

-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా మూడు ఎంపీ స్థానాలను మాత్రమే గెలిచే ఛాన్స్ ఉందని నరసాపురం ఎంపీ,ల రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. కడప, రాజంపేట, అరకు స్థానాలలో మాత్రమే ప్రస్తుతానికి మా పార్టీ నెగ్గే అవకాశాలు ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి మొదలుకొని నెల్లూరు జిల్లా వరకు అరకు మినహాయించి, మిగిలిన లోక్ సభ సెగ్మెంట్లలో వార్ వన్ సైడేనని తేల్చి చెప్పారు.

Electoral Bonds to YCP Party Rs. 300 crores
Will YCP win only 3 MP seats in the next election

175 అసెంబ్లీ స్థానాలకు 175 గెలుస్తామని, 25 ఎంపీ స్థానాలకు 24 ఎంపీ స్థానాలలో గెలుస్తామని చెబుతూ అభ్యర్థుల ఎంపికలో మార్పులు చేర్పులు చేస్తున్నామని చెప్పడం పరిశీలిస్తే నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్టు ఉందన్నారు. అభ్యర్థులను మారిస్తే 175 అసెంబ్లీ స్థానాలకు 200 స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 30 స్థానాలు వస్తాయా అంటూ ఎద్దేవా చేశారు. ట్రంప్ అవినాష్ సతీమణి గారికి ఒక సర్వే సంస్థ ఉన్నదని, ఆ సర్వే సంస్థ తప్పుడు నివేదిక ఇవ్వగా సాక్షి దినపత్రికలో ప్రముఖంగా ప్రచురించిందని తెలిపారు. ప్రశాంత్ కిషోర్ టీం, రిషి రాజు టీం వైకాపా తరపున పనిచేస్తున్నారని, ప్రశాంత్ కిషోర్ సర్వే అని, రిషి రాజు టీం రిపోర్ట్, ట్రంప్ అవినాష్ సర్వే అని చెప్పవచ్చు కదా అలా కాకుండా, టైమ్స్ నౌ పేరును ఉపయోగించి వారిని బదనాం చేయడం తప్ప ఇంకేమీ లేదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news