ప్యానెల్ స్పీకర్లుగా నలుగురు.. ప్రకటించిన స్పీకర్

-

ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇవాళ గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్నికాంగ్రెస్‌ సభ్యుడు రామ్మోహన్‌రెడ్డి ప్రతిపాదించారు. దానిపై సభ్యులు ప్రసంగిస్తున్నారు. కాగా ప్రతిపక్ష నాయకుడిగా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ ప్రకటించారు.

అదేవిధంగా ప్యానల్‌ స్పీకర్లుగా రేవూరి ప్రకాశ్‌ రెడ్డి, బాలూనాయక్‌, కౌసర్‌ మొయియుద్దీన్‌, కూనంనేని సాంబశివరావు పేర్లను స్పీకర్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్యానెల్ స్పీకర్ల పేర్లను ప్రకటించారు. శాసన సభకు సాధారణంగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. అయితే వీరిద్దరూ సభలో లేనప్పుడు ఈ ప్యానెల్ స్పీకర్లు తాత్కాలికంగా సభను నడిపిస్తుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news