బీసీలకు న్యాయం జరగాలంటే దేశంలో కాంగ్రెస్ రావాలి : వీ.హెచ్.

-

బీసీలకు న్యాయం జరగాలంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన మెజార్టీ అభ్యర్థులను పార్లమెంట్ కి పంపాలని ఆయన రిక్వెస్ట్ చేస్తూ.. సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణన చేసి అన్ని కులాలకు న్యాయం చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని.. అందుకే ప్రజలంతా కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని కోరారు.

ముఖ్యంగా బీసీలకు న్యాయం జరగాలంటే కుల గణన చేయాల్సిందేనని నొక్కి చెప్పారు. రాహుల్ గాంధీ కులగణన చేస్తామన్న హామీ తప్పకుండా అమలు చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సకల ప్రజలు సంపూర్ణమైన ఆనందంతో జీవించాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందని వివరించారు. మాట నిలబెట్టుకునేతత్వం ఇందిరమ్మ కుటుంబంలో ఉన్నదని.. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. 6 గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పి అధికారంలోకి రాగానే అమలు ప్రక్రియ మొదలుపెట్టామని హనుమంతరావు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news