ఏపీ విద్యుత్‌ సంస్థలకు ప్రతిష్టాత్మక అవార్డులు

-

CM JAGAN MOHAN REDDY : ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర విద్యుత్ సంస్థలు మరోసారి ప్రతిష్టాత్మక అవార్డులను కైవసం చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా అత్యుత్తమ పనితీరు కనబరిచిన విద్యుత్ సంస్థలకు అందించే ‘ఫాల్కన్ మీడియా – ఎనర్షియా ఫౌండేషన్’ జాతీయ అవార్డులను ఏకంగా మూడింటిని ఏపీ విద్యుత్ సంస్థలు పొందాయి. ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఏపీ ట్రాన్స్ కో ) కు ‘టాప్ స్టేట్ యుటిలిటీ ఫర్ ఎనర్జీ అండ్ ఇన్ఫాస్ట్రక్చర్’ అవార్డు లభించింది.

Prestigious awards for AP power companies

పంప్డ్ స్టోరేజీ పవర్ ప్రాజెక్టుల ప్రచారానికి సంబంధించి దేశంలోనే బెస్ట్ స్టేట్ టాప్ రెన్యూవబుల్ ఎనర్జీ నోడల్ ఏజెన్సీగా న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఆర్ఈడీసీఏపీ) అవార్డును కైవసం చేసుకుంది. రెన్యువబుల్ పవర్ పర్చేజ్ ఆబ్లికేషన్స్ (పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు బాధ్యత) లక్ష్యాన్ని చేరుకోవడంలోనూ ముందంజలో ఉన్న ఉత్తమ రాష్ట్రంగా ఏపీ విద్యుత్ సంస్థలను అవార్డు వరించింది.

Read more RELATED
Recommended to you

Latest news