నారా లోకేష్ తాతను చంపింది ఎవరు – సజ్జల

-

టీడీపీ పార్టీపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విరుచుకుపడ్డారు. నారా లోకేష్ తాతను చంపింది ఎవరు అంటూ ప్రశ్నించారు సజ్జల. బాలింతలు, పసి పిల్లలు ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోమని టీడీపీ చెబుతుందా?? అని తెలిపారు. ఎస్మా అంటే అత్యవసర సేవలు అన్న విషయం స్టాన్ ఫర్డ్ లో చదువుకున్న లోకేష్ కు తెలియదా?? అంటూ నిలదీశారు.

అంగన్వాడీలు సమ్మె మొదలు పెట్టి నెల దాటింది… అయినా అలా వదిలేయాలా?? ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విరుచుకుపడ్డారు. మేమంతో సంయమనంతో ఉన్నామని…ఆ బరువు ఇప్పుడు మోయలేం అని చాలా సార్లు చెప్పామని వివరించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. అయినా ఒకటి, రెండు డిమాండ్ల పై పట్టుబడుతున్నారన్నారు.రైతులను గుర్రాలతో తొక్కించింది ఎవరు?! టీడీపీ కాదా అని ఆగ్రహించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news