ఓటర్ జాబితా పై జరుగుతున్న అక్రమాలపై సీఈసీకి వివరించాం : చంద్రబాబు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై తిరుగుబాటు వచ్చిందని.. అందుకే నకిలీ ఓట్లు చేర్చేందుకు ఆ పార్టీ నేతలు కుట్ర చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని.. ఎప్పుడూ లేనివిధంగా అరాచకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన సమీక్షకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి హాజరయ్యారు. సీఈసీ రాజీవ్ కుమార్ ను కలిసి రాష్ట్రంలో ఓటరు జాబితాలో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదు చేశారు.

నేతలు ఇద్దరూ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఓటరు జాబితాలో అవకతవకలపై సీఈసీకి ఫిర్యాదు చేశాం. రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారు. టీడీపీ, జనసేన నేతలపై సుమారు 6,7వేల కేసులు పెట్టారు. పుంగనూరు కేసులో 200 మందికి పైగా జైలుకు వెళ్లి వచ్చారు. ఎన్నికల్లో ఎవ్వరినీ పని చేయకుండా చేసేందుకే అక్రమ కేసులు పెడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని హామి ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news