అయోధ్య ప్రతిష్టాపన రోజు శ్రీరాముడి కీర్తనలు పాడాలన్న సింగర్ చిత్రపై నెటిజన్ల దాడి

-

అయోధ్యలో జనవరి 22వ తేదీన జరగనున్న రామమందిర ప్రాణప్రతిష్ఠ వేడుకకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకను తిలకించేందుకు ఇప్పటికే లక్షల మంది భక్తులు అయోధ్యకు వెళ్తున్నారు. మరోవైపు ప్రముఖులు కూడా రామమందిరం ప్రారంభోత్సవానికి అయోధ్య నగరానికి వెళ్లనున్నారు. రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో కొంతమంది ప్రముఖులు తమ అభిమానులకు వీడియో సందేశాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.

ఇందులో భాగంగానే ప్రముఖ సింగర్ కె.ఎస్‌.చిత్ర (60) కూడా ఓ వీడియోను విడుదల చేశారు. అయితే చిత్ర విడుదల చేసిన వీడియో సందేశం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ‘‘ప్రాణప్రతిష్ఠ రోజున శ్రీరాముడి కీర్తనలు ఆలపించండి. సాయంత్రం వేళ ఇళ్లలో ప్రమిదలతో 5 దీపాలు వెలిగించండి’’ అని ప్రజలను కోరుతూ రెండు రోజుల కిందట వీడియో సందేశం విడుదల చేసిన చిత్ర ‘లోకా సమస్తా సుఖినోభవంతు’ అంటూ దాన్ని ముగించారు. దీంతో నెటిజన్లలో ఓ వర్గం ఆమెకు రాజకీయాలు ఆపాదిస్తూ తీవ్ర విమర్శల దాడికి దిగారు. మరో వర్గం తన మనోభావాలను తెలిపే హక్కు చిత్రకు ఉందంటూ ఆమెకు సపోర్ట్ను ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news