అయోధ్య రామ ప్రాణప్రతిష్ట సందర్భంగా మెగా కోడలు లావణ్య పోస్ట్..!

-

మెగా కోడలు లావణ్య త్రిపాటి గురించి పరిచయం చేయక్కర్లేదు పలు సినిమాలతో లావణ్య త్రిపాఠి పాపులర్ అయిపోయారు. లావణ్య త్రిపాఠి తాజాగా ఒక పోస్ట్ ని పెట్టారు అది ఇప్పుడు వైరల్ అవుతోంది. అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఆమెగా కోడలు లావణ్య త్రిపాఠి ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా రాముని ప్రాణ ప్రతిష్ట కోసం ఎదురుచూస్తున్నారు ఎట్టకేలకు ఈ కార్యక్రమం మొదలయ్యింది ప్రతి ఒక్కరు కూడా రాముని విగ్రహాల ఫోటోలని విపరీతంగా షేర్ చేస్తున్నారు.

తాజాగా మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇంస్టాగ్రామ్ లో రాముడు మీద స్పెషల్ పోస్ట్ చేసింది సాంప్రదాయ ఫోటోలని కూడా ఆమె షేర్ పట్టుకుని షేర్ చేసింది పట్టుచీర కట్టుకుని సీతారాముల ప్రతిమలు ఉన్న ఆభరణాలు వేసుకుని అందరి దృష్టి లావణ్య తన వైపుకు తిప్పుకునే విధంగా ఫోటోని పెట్టింది. శ్రీరాముని దివ్య నివాసమైన అయోధ్య లో జన్మించినందున ఈ శుభ సందర్భాన్ని చూడడం నా అదృష్టంగా భావిస్తున్నాను. భగవాన్ శ్రీరాముని ప్రాణ ప్రతిష్టని మనం చూస్తున్నప్పుడు ఇది నాకు తోటి భారతీయులందరికీ గొప్ప గర్వకారణం అని ఆమె రాసుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news