ఒక్క గుడి తేలేదు.. ఒక్క బడి తేలేదు.. బండి సంజయ్‌పై కేటీఆర్‌ సెటైర్లు

-

కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌పై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నిప్పులు చెరిగారు. ఐదేండ్లు ఎంపీగా ఉన్న బండి సంజయ్‌ కరీంనగర్‌కు ఒక్క గుడి తెచ్చిండా? ఒక్క బడి తెచ్చిండా అని ప్రశ్నించారు. కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గ స్థాయి సోషల్‌మీడియాలో వారియర్స్‌తో బుధవారం జరిగిన సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా  కేటీఆర్‌ మాట్లాడారు. పార్లమెంట్  సభ్యుడిగా కరీంనగర్‌ నియోజకవర్గానికి ఏం చేశావని నిలదీశారు. దమ్ముంటే ఐదేండ్లలో చేసిన అభివృద్ధిపై బోయిన్‌పల్లి వినోద్‌కుమార్‌తో చర్చకు రావాలని సవాల్  విసిరారు.

ఐదేండ్లలో కరీంనగర్‌ ఎంపీగా బండి సంజయ్‌ చేసింది ఏందంటే.. మనకు క్యాలెండర్‌ గురించి మాత్రం మంచిగ చెప్పిండు అని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. అన్నా.. ఇవాళ ఏ వారం అన్న? అంటూ బండి సంజయ్‌ గతంలో చేసిన ప్రసంగాన్ని ప్రదర్శించారు. ఇవాళ ఏ వారం అన్న.. రేపు ఏ వారం అన్న.. గిదేనా.. గీపాటి దానికి కరీంనగరోళ్లు క్యాలెండర్‌ కొనుక్కుంటే అయిపోతుండే.. ఎంపీగా ఎందుకు..? అని ప్రశ్నించడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news