YCP : ఎల్లుండి 2 లక్షల మందితో వైసీపీ బహిరంగ సభ

-

YCP : ఎల్లుండి 2 లక్షల మందితో వైసీపీ బహిరంగ సభ జరుగనుంది. విశాఖ జిల్లా భీమిలిలోని సంఘీవలసలో ఎల్లుండి భారీ బహిరంగసభ నిర్వహణకు వైసీపీ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులు, నాయకులు, గృహ సారధులు, కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేసేలా సీఎం జగన్ దిశ నిర్దేశం చేయనున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి 5-6వేల మంది చొప్పున దాదాపు 2 లక్షల మంది వరకు హాజరవుతారని అంచనా.

YCP public meeting with 2 lakh people in Ellundi

ఇక అటు నవరత్నాలు-పేదలందరికీ ఇల్లు కార్యక్రమం కింద 31.19 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన జగన్‌… ప్రభుత్వం ఈనెల 27 నుంచి వాటికి రిజిస్ట్రేషన్లు చేయనుంది. గ్రామ/వార్డు సచివాలయాల్లో ఈ ప్రక్రియ ప్రారంభం కానుండగా….ప్రభుత్వం తరఫున వీఆర్వో రిజిస్ట్రేషన్ చేస్తారు. వచ్చేనెల 9వ తేదీ కల్లా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి కానుంది. ఈ కార్యక్రమం సజావుగా సాగేలా కలెక్టరేట్లలో ప్రభుత్వం కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయనుంది.

Read more RELATED
Recommended to you

Latest news