చంద్రబాబు, పవన్ చెరో 175 సీట్లు చొప్పున ప్రకటిస్తే ఏ గొడవ ఉండదు – గుడివాడ

-

చంద్రబాబు, పవన్ చెరో 175 సీట్లు చొప్పున ప్రకటిస్తే ఏ గొడవ ఉండదని ఎద్దేవా చేశారు మంత్రి గుడివాడ అమరనాథ్‌. మేం దేనికైనా సిద్దమని.. అభివృద్ధి చూపించేందుకు సిద్దమన్నారు. కలసి‌వస్తున్న రాజకీయ పార్టీలను ఎదుర్కొనేందుకు సిద్దమని చెప్పారు. వైనాట్ 175 నినాధం మొదటి నుంచి వినిపిస్తున్నాం.. నేడు అదే నినాధంతో సిద్దమౌతున్నానని వెల్లడించారు.

gudiwada amarnath

రెండు సీట్లు టిడిపి ప్రకటిస్తే, రెండు జనసేన ప్రకటించింది…చంద్రబాబు , పవన్ ఇద్దరు చెరో 175 సీట్లు చొప్పున ప్రకటిస్తే ఏ గొడవ ఉండదని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ఏ ధర్మం లేదు.. ధర్మానికి అర్దం తెలియదు….ప్రజల మద్దతుతో ముందుకు వెళతామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లొ లేదు, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ర్టంలో లే‌ని పార్టీకి అధ్యక్షుడు, దానికి తిరిగి సమాదానం చెప్పడం అవసరం లేదని చెప్పారు. ఎవరు ఎక్కడ నుంచి పొటీ చేసినా జగన్ ను చూసి ఓటు వేస్తారని వివరించారు. మళ్లీ వైసిపి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి గుడివాడ అమరనాథ్‌.

Read more RELATED
Recommended to you

Latest news