శ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలను మేం తమిళనాడులో అంగీకరించం : డీఎంకే ఎంపీ రాజా

-

డీఎంకే ఎంపీ ఏ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ అనేది దేశమే కాదని పేర్కొన్నారు. ‘తమిళనాడు,కేరళ, ఒడిశా వంటివి ఒక్కోటి ఒక్కో దేశం అని,ఇవన్నీ కలిస్తే భారత ఉపఖండం మాత్రమే కానీ భారత్ దేశం కాదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. గొడ్డు మాంసం తింటే వద్దనడానికి మీరెవరు? అని ప్రశ్నించారు.ఈ జై శ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలను మేం తమిళనాడులో అంగీకరించం అని అన్నారు. రామాయణాన్ని మేం నమ్మం అని అన్నారు. తమిళనాట మమ్మల్ని లేకుండా చేస్తే.. ఇండియానే ఉండదు’ అని ఆయన హెచ్చరించారు.

ఇటీవల ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో డీఎంకే ఎంపీ రాజా చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. రాముడి గురించీ ఆయన తప్పుగా మాట్లాడారని.. వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ డిమాండు చేసింది. దీనిపై స్పందించిన కాంగ్రెస్‌.. రాజా వ్యాఖ్యలతో ఏకీభవించడం లేదని, వాటిని ఖండిస్తున్నామని వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news