బాబూ ఏనాడైనా ఒంటరిగా పోటీ చేశావా?: అమర్నాథ్

-

మరికొన్ని రోజులలో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయా పార్టీలు కసరత్తులను ప్రారంభించాయి. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో గెలుపొందేందుకు టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ టూర్ లో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల మధ్య పొత్తు ఖరారైంది అని చంద్ర బాబు నాయుడు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పై సంచలన వ్యాఖ్యలు చేశారు.టీడీపీ అధినేత చంద్రబాబు ఏనాడైనా ఒంటరిగా పోటీ చేశారా? అని మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. ‘ సీఎం జగన్ను ఎదుర్కోలేకే పొత్తులు పెట్టుకుంటున్నారు అని విమర్శించారు. విపక్షాల పొత్తు కుయుక్తులను ప్రజలు గమనిస్తున్నారు. విపక్షాలను చూస్తేనే వైసీపీ బలం అర్థమవుతోంది. చంద్రబాబు రాష్ట్రంలోని అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు అని అన్నారు. పవన్, బాబు ఢిల్లీ వీధుల్లో తెలుగు వారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు’ అని ఆయన ఆరోపించారు .

Read more RELATED
Recommended to you

Latest news